IND Vs SL: మొహాలీ టెస్టులో టీమిండియా డిక్లేర్డ్.. జడేజా డబుల్ సెంచరీపై దుమారం

-

మొహాలీ వేదికగా శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో లో ఇండియా భారీ స్కోరు చేసింది. ఇవాళ రెండో రోజు సెకండ్ షేషన్ లో టీమిండియా 578 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అయితే టీమ్ ఇండియా ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా అత్యధికంగా 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు అలాగే మూడు సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి మహ్మద్ షమీ 20 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు.

ఇక స్పిన్నర్ అశ్విన్ 61 పరుగులు చేసి అవుటయ్యాడు. అటు శ్రీలంక బౌలర్లలలో… సురంగ, ఫెర్నాండో, లసిత్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇది ఇలా ఉండగా… రవీంద్ర జడేజా డబుల్ సెంచరీ చెరువులు ఉండగా డిక్లేర్ చేయడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై విమర్శలు వస్తున్నాయి. డబుల్ సెంచరీ కి కేవలం 25 పరుగుల దూరంలో ఉన్నాడు జడేజా. అదే సమయంలో రోహిత్ శర్మ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీంతో జడేజా ఫ్యాన్స్ అలాగే క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మ కెప్టెన్సీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news