BREAKING : క్వార్టర్ బాటిల్, కోడిని పంపిణీ చేసిన టీఆర్ఎస్ నేతకు నోటీసులు

-

BREAKING : క్వార్టర్ బాటిల్, కోడిని పంపిణీ చేసిన టీఆర్ఎస్ నేతకు నోటీసులు జారీ అయ్యాయి. వరంగల్ జిల్లా TRS నేత రాజనాల శ్రీహరికి తెలంగాణ రాష్ట్ర ఈసీ నోటీసులు..జారీ చేసింది. మునుగోడు ఓటర్లకు లిక్కర్ పంపిణీ చేశారన్న ఆరోపణలపై ప్రభాకర్ అనే వ్యక్తి ఎలెక్షన్ కమిషన్ కి ఫిర్యాదు అందింది.

దసరా నాడు క్వార్టర్ బాటిల్, కోడిని టీఆర్‌ఎస్‌ పార్టీ నేత రాజనాల శ్రీహరి..పంపిణీ చేశారు. అయితే.. ఈ ఫిర్యాదుపై స్పందించింది ఈసీ. ఈ మేరకు వరంగల్ జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు కోరింది ఈసీ. అనంతరం రాజనాల శ్రీహరికి ఈసీ నోటీసులు అందజేశారు వరంగల్ జిల్లా కలెక్టర్. రెండు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది ఈసీ. ఇక దీనిపై టీఆర్‌ఎస్‌ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news