పంజాబ్ ఎన్నికలు వాయిదా…! కీలక సమావేశం నిర్వహించనున్న ఈసీ

-

పంజాబ్ ఎన్నికలు దాదాపు వాయిదా పడే అవకాశమే కనిపిస్తోంది. నేడు దీనిపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించనుంది. పంజాబ్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ.. ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ పంజాబ్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ కోరారు. ఫిబ్రవరి 14న జరిగే పంజాబ్ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నారు.  గురు రవిదాస్ జయంతి వేడుకల నేపథ్యంలో బనారస్ వెళ్లేందుకు వీలుగా.. దళిత వర్గానికి చెందిన ప్రతినిధులు కోరిన విషయాన్ని ఆయన ఈసీకి వెళ్లడించారు. ఈ వర్గానికి చెందిన వారు పంజాబ్ లో 32 శాతం ఉన్నారు. బనారస్, యూపీలో జరిగే వేడుకలకు పంజాబ్ నుంచి దాదాపు 20 లక్షల మంది వెళ్లే అవకాశం ఉంది. ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు జరిగే వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నారు.

పంజాబ్ లో అధికార కాంగ్రెస్ పార్టీనే కాకుండా బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా ఎన్నికలు వాయిదా వేయాలని కోరతున్నారు. దీంతో నేడు జరిగే ఈసీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాదాపుగా ఎన్నికలను వాయిదా వేస్తారని తెలుస్తోంది. 5వ విడతలో పంజాబ్ ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news