ఢిల్లీ లిక్కర్ స్కాం లో “ఈడీ” తప్పిదం.. ఆప్ నేతకు క్షమాపణలు !

-

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడీ తన జోరును పెంచింది. ఈ కేసులో ప్రత్యక్షముగా మరియు పరోక్షముగా ప్రమేయం ఉన్న వారిని అందరినీ విచారిస్తూ తప్పు చేసిన వారిని అరెస్టులు చేస్తోంది. కాగా ఈ కేసులో తాజాగా ఈడీ నే పొరపాటు చేయడం సంచలనంగా మారుతోంది. ఈడీ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లో ఒకరి పేరుకు బదులుగా మరొకరి పేరును మార్చడం వలన గందరగోళంగా మారింది. మాములుగా ఈ స్కాం లో ప్రమేయం ఉందన్న కారణంగా ఢిల్లీ ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ పేరును కేసులో చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ సింగ్ వారికీ తన ప్రతిష్టను దెబ్బ తీశారు అన్న కారణం చేత లీగల్ నోటీసులు పంపించారు. కానీ అది క్లరికల్ మిస్టేక్ వలన జరిగిందని ఆయనకు ఈ కేసుకు సంబంధం లేదని.. రాహుల్ సింగ్ కు బదులుగా మా స్టాఫ్ సంజయ్ సింగ్ అని టైపు చేయడంతో ఈ సమస్య తలెత్తిందని ఈడీ అధికారిక లేఖను రాసింది.

పైగా సంజయ్ సింగ్ కు ఈడీ క్షమాపణలు కూడా చెప్పడం కొసమెరుపు. దీనితో బాధ్యత కల్గిన స్థానంలో ఉండి కూడా ఇలాంటి పొరపాట్లు చేయడం ఏమిటని ఈడీ ని అంతా విమర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news