ముంచుకొస్తున్న ‘మోచా’ తుపాను.. తూర్పు తీర రాష్ట్రాలకు ముప్పు

-

అకాల వర్షాలతో అల్లాడిపోతున్న రైతన్నలపై భారత వాతావరణ శాఖ మరో పిడుగు వేసింది. వచ్చే వారంలో తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉందని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను బలపడే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.

‘‘మే 6 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశముంది. ఆ మరుసటి రోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై మే 9వ తేదీ నాటికి తుపానుగా బలపడే అవకాశముంది. ఈ తుపాను ఉత్తర దిశగా కదులుతూ మరింత తీవ్రమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది’’ అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహపాత్రతెలిపారు.

ఈ తుపాను ఏర్పడితే దానికి ‘మోచా’ అని పేరు పెట్టనున్నట్లు ఐఎండీ తెలిపింది.  యెమెన్‌ దేశంలోని పోర్టు నగరం మోచా పేరుమీదుగా పేరు పెట్టినట్టు పేర్కొంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత తుపాను దిశ గురించి మరింత కచ్చితమైన సమాచారం తెలుస్తుందని ఐఎండీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news