ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడి నోటీసులు!

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడి నోటీసులు పంపింది. కాగా ప్రస్తుతం ఆమె కరోనాతో క్వారంటైన్ లో ఉండడంతో ఆ నోటీసులను కవిత సహాయకులకు నోటీసులను అందజేసినట్లు సమాచారం. ఈ కేసులో దేశవ్యాప్తంగా 40 కి పైగా ప్రాంతాలలో ఈడీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. ఈడి రైడ్స్ కోసం ఢిల్లీ నుండి మొత్తం 68 మంది ఈడి అధికారులు వచ్చారు.

25 వాహనాలలో వచ్చిన ఈ టీంలు ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాదులో డిడి కాలనీ లోను ఈరోజు ఉదయం సోదాలు కొనసాగాయి. గోరంట్ల బుచ్చిబాబు ఇంటి తో పాటు అతని ఉద్యోగి ఇంట్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది ఈడి. డిడి కాలనీలో ఉంటున్న బుచ్చిబాబు దగ్గర పనిచేస్తున్న శ్రీధర్ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించి బుచ్చిబాబు ఇంటికి చేరుకున్నారు ఈడి అధికారులు. శ్రీధర్ ఇంట్లో కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news