సోనియా గాంధీకి ఈడీ బిగ్ షాక్.. ఆ ఆఫీసు సీజ్

-

నేషనల్ హెరాల్డ్​ మనీలాండరింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ కార్యాలయాన్ని తాత్కాలికంగా సీల్ చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్. మంగళవారం నుంచి దిల్లీ, లఖ్​నవూ, కోల్​కతాలో 10 నుంచి 12 చోట్ల అనేక గంటలపాటు సోదాలు జరిపిన ఈడీ.. కాంగ్రెస్​కు చెందిన హెరాల్డ్​ హౌస్​లోని యంగ్ ఇండియన్​ ఆఫీస్​ను సీజ్ చేస్తున్నట్లు బుధవారం సాయంత్రం ప్రకటించింది. తమ అనుమతులు లేకుండా ఆ కార్యాలయాన్ని ఎవరూ తెరవకూడదని స్పష్టం చేసింది.

మంగళవారం జరిపిన ఈడీ దాడుల్లో అధికార ప్రతినిధులు హాజరుకానందున సాక్ష్యాలను సేకరించలేకపోయామని, వాటిని భద్రపరిచేందుకే తాత్కాలికంగా సీజ్​ చేస్తున్నట్లు ప్రకటించింది. నేషనల్​ హెరాల్డ్​ ఆఫీస్​లో యంగ్​ ఇండియన్​ సంస్థ మినహా మిగతా కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని వెల్లడించింది.

నేషనల్ హెరాల్డ్ కేసులో సోదాలు, యంగ్ ఇండియన్​ కార్యాలయం సీజ్ నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం, జన్​పథ్​లోని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇంటి వద్ద భారీ సంఖ్యలో మోహరించారు.

దిల్లీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే రోడ్డును ఎందుకు బ్లాక్​ చేశారని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​ ప్రశ్నించారు. ఇది ఆనవాయితీగా మారిందని ఆరోపించారు. ఇలా ఎందుకు చేస్తున్నారో మిస్టరీగా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసి.. మోహరించినట్లు పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news