తబ్లిఘీ జమాత్ ని టార్గెట్ చేసిన ఈడీ…!

-

దేశ వ్యాప్తంగా కరోనా విస్తరణకు ప్రధాన కారణం అయిన తబ్లిఘీ జమాత్ ని ఈడీ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల తబ్లిఘీ జమాత్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసారు. ఆ తర్వాత మనీ లాండరింగ్ వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడి నుంచి కూడా ఈడీ ఫోకస్ చేసి దేశ వ్యాప్తంగా తబ్లిఘీ జమాత్ కార్యాలయాల్లో సోదాలు చేయాలి అని భావిస్తుంది.

హైదరాబాద్, ముంబై, ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడానికి గానూ రంగం సిద్దం చేసింది. సంస్థ అధినేత మౌలానా… తబ్లిఘీ కి వచ్చిన విరాళాలతో మనీ లాండరింగ్ కి పాల్పడ్డారు అని ఈడీ అంటోంది. దీనిపై కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ కూడా చేసే అవకాశాలు ఉన్నాయని ఈడీ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news