BREAKING: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం

-

విద్యా సంస్థల పునః ప్రారంభం పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల ఓపెన్ చేయడం పై తెలంగాణ రాష్ట్ర సీఎం కెసిఆర్ ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చర్చలు నిర్వహించిన సిఎం కెసిఆర్..  తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటో తారీకు నుంచి విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించాలని…. నిర్ణయం తీసుకున్నారు.

cm kcr | సీఎం కేసీఆర్

విద్యాసంస్థలు ప్రారంభించ వచ్చని..  తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మరియు విద్యా శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా  సిఎం కేసీఆర్  గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే విద్యా సంస్థల పునః ప్రారంభం నేపథ్యం లో అందరూ కరోనా నియమ నిబంధనలు పాటించాలని ఆదేశించింది సర్కార్.  ఈ మేరకు తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక  తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయం తో సెప్టెంబర్ ఒకటో తారీకు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష క్లాసులు ప్రారంభం కానున్నాయి.  కాగా తెలంగాణ లో కొన్ని రోజులు కరోనా కేసులు  తగ్గు ముఖం పట్టిన సంగతి తెల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news