హరీష్ రావు పచ్చి అబద్దాల కోరు.. మామకు బానిస- ఈటెల రాజేందర్

-

హుజూారాబాద్ బైపోల్ పోరు సంగ్రామాన్ని తలపిస్తుంది. ఆరు నెలల నుంచి ప్రారంభమైన ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు మకాం వేసి ప్రచారం ముమ్మరం చేశారు. ఇదే విధంగా బీజేపీ కూడా తమ కీలక నాయకుల్ని హుజూరాబాద్లో మోహరించింది. తాజాగా మరోసారి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీపై, నాయకులపై ఫైర్ అయ్యారు. మంత్రి హరీష్ రావు పచ్చి అబద్దాల కోరు అని విమర్శించారు. మామకు బానిసగా అభివర్ణించారు. అనవసరంగా నాపై దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. కేంద్రం దొడ్డు వడ్లు కొనడం లేదని అసత్య ఆరోపణలను చేస్తుంన్నారు. కేంద్రం సహకారంలో ఈసారి కూడా దొడ్డు వడ్లను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. నేను ప్రచారానికి వెళ్లిన చోట కరెంట్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. నాకు గన్ మెన్లను తగ్గించారు, ఒకే గన్ మెన్ ను ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాపై కుట్ర చేస్తున్నట్లు అనుమానం వస్తుందని ఆరోపణలు గురిప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news