కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా సుశీల్ చంద్ర ?

-

తదుపరి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ గా సుశీల్ చంద్రను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 13న సుశీల్ చంద్ర బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. మే 14, 2022 వరకు పదవిలో సుశీల్ చంద్ర కొనసాగనున్నారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషనర్ గా సుశీల్ చంద్ర కొనసాగుతున్నారు.

కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ గా సుశీల్ చంద్ర ఆధ్వర్యంలో గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది మార్చి లోపు గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది మే 14 తో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. “కేంద్ర ఎన్నికల సంఘం” లో బాధ్యతలకు ముందు “కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు” ఛైర్మన్‌గా సుశీల్ చంద్ర ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news