జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం..!

-

ఆదివారం నాడు జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని భద్రతా దళాలకు చెందిన అధికార వర్గాలు తెలిపాయి. దక్షిణ కశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలోని రిబాన్‌ గ్రామంలో ఉగ్రవాదులున్నట్లు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఆర్మీ, సీఆర్పీఎఫ్‌, సోపియాన్‌ పోలీసులు అక్కడకు చేరుకుని సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు కూడా దీటుగా బదులివ్వడంతో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. మృతుల్లో జైషే మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదులున్నట్లు గుర్తించారు. అయితే ఉగ్రవాదులు వైపు నుంచి ఇంకా కాల్పులు కొనసాగడంతో అక్కడ మరికొందరు ఉండవచ్చని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను విస్తృతం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news