శ్రీన‌గ‌ర్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్, ముగ్గురు ఉగ్ర‌వాదుల హ‌తం..!

-

శనివారం అర్ధరాత్రి జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని భద్రతా దళాలకు చెందిన అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్ర‌వాదులున్నార‌నే స‌మాచారంతో శ్రీన‌గ‌ర్‌లోని పంతా చౌక్‌లో శ‌నివారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలు, స్థానిక పోలీసులు నాకా బందీ నిర్వ‌హించారు. ఇంతలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు కూడా దీటుగా బదులివ్వడంతో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.

2 terrorists got encountered in kashmir soperi ambush
 

అలాగే ఓ ఏఎస్ఐ కూడా క‌న్నుమూశారు. ‌అయితే ఉగ్రవాదులు వైపు నుంచి ఇంకా కాల్పులు కొనసాగడంతో అక్కడ మరికొందరు ఉండవచ్చని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను విస్తృతం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news