తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడండి : మంత్రి పొన్నం ప్రభాకర్

-

ఎమ్మెల్యే,మంత్రి పొన్నం ప్రభాకర్ కీల వ్యాఖ్యలు చేశారు.వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో ఆయన పర్యటించారు.గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని పెద్దచెరువు పనులను పరిశీలించారు. గ్రామంలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా.. అదనపు మోటార్లు ఏర్పాటు చేసుకోవాలని గ్రామ స్పెషల్ ఆఫీసర్లకు ఆయన సూచించారు.

వచ్చే విద్యా సంవత్సరం వరకు స్కూళ్లలో తరగతి గదులకు కలర్స్ వేసి.. టాయిలెట్స్ నిర్మించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఫిష్ మార్కెట్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులను కోరారు. దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి ఎన్నికల కోడ్ అయిపోగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news