శభాష్ సార్: విద్యుత్ శాఖ తీసుకున్న లంచాలను రూపాయితో సహా వసూలు చేసిన ఈఆర్సి చైర్మన్ !

-

రోజు రోజుకీ మన దేశం అభివృద్ధి పథంలో వెళుతున్నా కొందరు అధికారులు మాత్రం ఇంకా తమ తమ స్వార్ధాల కోసం దిగజారుడు పనులు చేస్తూనే ఉన్నారు. తెలంగాణలో మెదక్, వికారాబాద్ మరియు యదాద్రి జిల్లాలకు చెందిన విద్యుత్ శాఖ అధికారులకు కొందరు తమ తమ విద్యుత్ అవసరాల నిమిత్తం లంచాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ విషయం స్వయంగా లంచాలు ఇచ్చిన వారే ఈ ఆర్ సి కు కంప్లైంట్ చేయడంతో రంగంలోకి దిగిన చైర్మన్ శ్రీ రంగారావు లంచం ఇచ్చినట్లుగా ఉన్న డిజిటల్ ఆధారాలను పరిశీలించి సదరు అధికారుల నుండి లంచం తీసుకున్న డబ్బును వసూలు చేసి ఇచ్చిన వారికి ఇప్పించారు. ఈ తరహా అధికారులు ఉండడం చాలా అరుదు… ఇకనైనా లంచగొండులు ఇలాంటి వారిని చూసైనా మారుతారని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news