కిషన్ రెడ్డివి అన్నీ.. చిల్లర రాజకీయాలే : తెలంగాణ మంత్రి

-

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయినా తెలంగాణా కు ఒరిగిందేమి లేదని.. కిషన్ రెడ్డి హుందాగా ఉండాలి..చిల్లర రాజకీయాలు చేయొద్దని మండిపడ్డారు. కానీ కిషన్ రెడ్డి అన్నీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రం తెలంగాణ లో టూరిజం కు ఒక్కరూపాయి ఇచ్చిందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే బండి సంజయ్ పరువు తీసుకున్నాడని ఎద్దేవా చేశారు.

కిషన్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు ఆపేయాలని.. పెట్రోల్ ధర పెరిగిందో లేదో, డీజిల్ గ్యాస్ ధరలు పెంచారో లేదో చెప్పాలని చురకలు అంటించారు. మిషన్ భగీరథ కు మెచ్చుకున్నారు కానీ కేంద్రం పైసా ఇచ్చిందా ? అని నిలదీశారు. అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ..కిషన్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని.. బీజేపీ, కుటుంబ పాలన వారసత్వాల గురించి మాట్లాడితే నవ్వొస్తోందన్నారు. బీజేపీ సీనియర్ నేతల కుటుంబ సభ్యులంతా ప్రస్తుతం పదవుల్లో ఉన్నారని.. బీజేపీ అంటేనే అమ్మకం, టిఆర్ఎస్ అంటే నమ్మకమన్నారు. బీజేపీ దేశాన్ని హోల్ సేల్ గా అమ్మేస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news