చేతకాకపోతే… సీఎం పదవికి రాజీనామా చెయ్ : కేసీఆర్‌కు ఈటల సవాల్

-

పరిపాలన చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, బిజెపి నేతలు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రజల సెంటిమెంట్ మీద ఓట్లు అడిగే హక్కు కేసీఆర్ కు ఎక్కడిది, పథకాలు, ప్రలోభాలకు గురి చేసిన హుజురాబాద్ ప్రజలు నన్ను హక్కున చేర్చుకున్నారు.

నా గెలుపుతో కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని ఫైర్‌ అయ్యారు. నిధులు కేంద్రానివి, ఫోటోలు కేసీఆర్ వి…. ముఖ్యమంత్రి మాటలను ప్రజలు నమ్మేపరిస్థితి రాష్టంలో లేదని ఫైర్‌ అయ్యారు. హుజురాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీ 600కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రజల విశ్వసాన్ని పొందలేక పోయారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అహంకారానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారు. కేంద్రం 30రూపాయలకు బియ్యాన్ని కొని రాష్టానికి 3 రూపాయలకు ఇస్తుంది. కేసీఆర్ ధన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు గా నటించి పబ్బం గడుపుతున్నాడని ఆగ్రహించారు. నేను పోరాడింది న్యాయం, ధర్మం కోసమని… కేసీఆర్ పోరాడింది, అధికారం, అహంకారం కోసం మాత్రమేనన్నారు ఈటల రాజేందర్‌.

Read more RELATED
Recommended to you

Latest news