మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నరసయ్య హఠాన్మారణం

-

ఖమ్మం మధిర మాజీ ఎమ్మెల్యే సీనియర్ కమ్యూనిస్టు నేత కట్టా వెంకట నరసయ్య అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతున్న ఆయన నిన్న రాత్రి తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. ఆయన యుక్త వయసు నుంచి రాజకీయాల్లో ఉన్నారు.

మధిర నుంచి రెండు సార్లు సిపిఎం నుంచి ఎం.ఎల్ ఏగా ఎన్నికైన కట్టా 2009 లో పార్టీ విధానాలు నచ్చక పోవడం తో రెండు నెలలు ముందుగానే శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక మాజీ ఎమ్యెల్యే కట్ట వెంకట నరసయ్య మరణం పట్ల ఎంపి నామ నాగేశ్వరావు సంతాపం వ్యక్తం చేశారు. మంచి ప్రజానాయకుడిని కోల్పోయామని ఉమ్మడి మధిర నియోజక వర్గం అభివృద్ధిలో కట్టా పాత్ర కీలకం అని అన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందు ఉన్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news