Breaking : మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు తప్పిన ప్రమాదం.. కారు నుజ్జునుజ్జు

-

మాజీ ఎమ్మెల్సీ పురాణం స‌తీష్ కుమార్‌కు ప్ర‌మాదం త‌ప్పింది. కుకునూరుప‌ల్లి వ‌ద్ద స‌తీష్ కుమార్ ప్ర‌యాణిస్తున్న కారు రోడ్డుప్ర‌మాదానికి గురైంది. ఇన్నోవా వాహ‌నం నుజ్జునుజ్జు అయింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావ‌డంతో కారులో ప్ర‌యాణిస్తున్న వారంతా సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. కుమారుడు కౌశిక్‌తో క‌లిసి హైద‌రాబాద్‌కు వెళ్తుండ‌గా, ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. మాజీ ఎమ్మెల్సీకి ఎలాంటి గాయాలు సంభ‌వించ‌క‌పోవ‌డంతో అటు కుటుంబ స‌భ్యులు, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మాజీ ఎమ్మెల్సీ పురాణం స‌తీష్ కుమార్‌కు త‌ప్పిన ప్ర‌మాదం

Read more RELATED
Recommended to you

Latest news