టాలీవుడ్ డ్రగ్స్ కేసు : సెలబ్రిటీల పాత్రపై ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన

-

టాలీవుడ్ డ్రగ్స్ కేసు పై ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. కెల్విన్ పై ఛార్జ్ షీట్ లో సినీ తారల విచారణ ప్రస్తావించిన ఎక్సైజ్ శాఖ .. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని తేల్చేసింది. సినీ తారలు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, హోటల్ నిర్వాహకులకు డ్రగ్స్ అమ్మినట్లు కెల్విన్ వాంగ్మూలం ఇచ్చాడని.. సిట్ బృందం పలువురికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించిందని ఎక్సైజ్ శాఖ పేర్కొంది.

అన్ని రకాల సాక్ష్యాలను సిట్ బృందం పరిశీలించి, విశ్లేషించిందని.. సెలబ్రిటీలపై బలమైన తగిన ఆధారాలు లభించలేదని వెల్లడించింది. సెలబ్రిటీలపై కెల్విన్ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని.. సెలబ్రిటీలపై కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవపట్టించేలా ఉన్నాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. కేవలం నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలుగా భావించలేమని.. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్ వాంగ్మూలం సరిపోదని పేర్కొంది. సెలబ్రిటీలు, ఇతర అనుమానితుల వద్ద డ్రగ్స్ కూడా లభించలేదని.. పూరి జగన్నాథ్, తరుణ్ స్వచ్ఛందంగా బయో శాంపిల్స్ కూడా ఇచ్చారని పేర్కొంది. పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్ తేల్చిందని ఎక్సైజ్ శాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news