తెలంగాణ: కాళ్ళు మొక్కడంపై సిద్దిపేట కలెక్టర్ వివరణ..

-

సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ల భవనాల ప్రారంభోత్సవం గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు ముఖ్యమంత్రి పాదాలకు నమస్కరించడం విమర్శల పాలైంది. ఐఏఎస్ అధికారులై ఉండి ఇలా ఎందుకు చేసారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. తెలంగాణలో పెద్దలను గౌరవిస్తారని, పెద్దలను గౌరవించడం తెలంగాణ సాంప్రదాయమని, సీఎం కేసీఆర్ పెద్దవారని, అందుకే అలా కాళ్ళకి నమస్కరించానని చెప్పుకొచ్చారు.

కానీ ప్రతిపక్షాలతో పాటు ఇతరుల మాటలు వేరేలా ఉన్నాయి. ఇలా చేయడం వల్ల అధికారులంతా ముఖ్యమంత్రికి అనుగుణంగా పనిచేస్తారన్న అభిప్రాయం జనాల్లోకి వెళ్ళిపోయిందని, ప్రభుత్వ అధికారులు ఇలా చేయడం సరికాదని వారిస్తున్నారు. ఐతే కలెక్టర్ వివరణ వచ్చినప్పటికీ విమర్శలు మాత్రం ఆగట్లేదు. మరి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news