బ్రేకింగ్ : ఆయిల్ ట్యాంకు పేలి ఇద్ద‌రు మృతి, న‌లుగురికి గాయాలు

-

ఈ మ‌ధ్య ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో నిత్యం ఏదో ఓ ప్రాంతంలో ప్ర‌మాదాలు జ‌రుగుతూనే ఉన్నాయి. నిన్న చౌటుప్ప‌ల్ మండ‌లం తుప్రాన్ పేట బ‌స్టాండ్ వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించ‌డంతో ఓ మ‌హిళ మృతి చెందింది. ఆ మ‌హిళ రోడ్డు దాటుతున్న స‌మ‌యంలో హైద‌రాబాద్ వైపు నుంచి విజ‌య‌వాడ వైపు వెళ్లుతున్న ఓ కారు ఢీ కొట్ట‌డంతో తీవ్రంగా గాయ‌ప‌డిన మ‌హిళ‌ను ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించేలోపు అప్ప‌టికే మృతి చెందింది.

మ‌రొక ఘ‌ట‌న‌లో మున‌గాల వ‌ద్ద రోడ్డు దాటుతున్న ద్విచ‌క్ర వాహ‌నాన్ని కారు ఢీ కొట్ట‌డంతో ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందారు. మ‌రొక ఘ‌ట‌న‌లో యాద‌గిరి గుట్ట మండ‌లం మ‌హ‌బూబ్‌పేట గ్రామంలో ఓ గీత కార్మికుడు తాటి చెట్టుపై నుంచి జారీ కింద‌ప‌డి మృతి చెందాడు. ఇలా నిత్యం ఏదో ఒక ఘ‌ట‌న‌లో మృతి చెందుతూనే ఉన్నారు. తాజాగా సూర్య‌పేట జిల్లా కేంద్రంలో సూర్య‌పేట కొత్త బ‌స్టాండ్ వ‌ద్ద ఓ ఆయిల్ ట్యాంకు పేలింది. ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రొక న‌లుగురికి గాయాల‌య్యాయి. ఆయిల్ ట్యాంక‌ర్‌కు వెల్డింగ్ చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా ఆయిల్ ట్యాంక‌ర్ పేలింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news