మీడియా అక్రిడేషన్ కార్డుల గడువు పొడిగింపు

-

తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ (గుర్తింపు కార్డు) గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత రావు ఇవాళ ఉత్తర్వలు జారీ చేశారు.ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

వర్కింగ్ జర్నలిస్టుల కోసం ప్రతి రెండేళ్లకు ఒకసారి అక్రిడేషన్ కార్డుల సదుపాయం రాష్ట్ర సమాచార శాఖ కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఆ గడువు ఈ నెల జూన్ 30వ తేదీతో ముగుస్తుంది .ఇక ఆ గడువు తేదీని సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news