ప్రియుడి మోజులో భార్య… భర్తను క్రూరంగా చంపేసి, పాము కాటుగా కలరింగ్

-

క్షణకాలం సుఖం కోసం పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు కొంతమంది మహిళలు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తలను, కన్న బిడ్డలను కడతేరుస్తున్నారు. తమ సంబంధాలకు అడ్డుగా ఉన్నవారిని అడ్డుతొలగించుకుంటున్నారు. చివరకు కటకటాలపాలవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే అనంతపురంలో జరిగింది.అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని.. భర్తను అంతమొందించి పాము కాటుగా చిత్రీకరించింది. చివరకు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.

అనంతపురం రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…ఆలమూరు గ్రామానికి చెందిన చియ్యేడు రవీంద్ర( 40), బోయ విజయలక్ష్మీ భార్యభర్తలు. వీరిద్దరికి తొమ్మిదేళ్ల ముందు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే  భార్య విజయలక్ష్మీ కొంత కాలంగా సమీపబంధువు చియ్యేడు సందీప్ తో వివాహేతర సంబంధానన్ని కొనసాగిస్తోంది. 

ఇదిలా ఉంటే తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్త రవీంద్రను అడ్డు తొలగించుకునేందుకు ప్రణాళిక రచించారు. ఈ పథకం ప్రకారం విజయలక్ష్మీ తన ప్రియుడు సందీప్ తో కలిసి తలదిండుతో రవీంద్రకు ఊపిరాడకుండా చేసి అత్యంత కిరాతకంగా చంపేశారు. ఆతరువాత పాము కాటుతో మరణించినట్లుగా కట్టుకథ అల్లారు. అయితే పోస్ట్ మార్టం నివేదికలో శరీరంపై గాయాలు ఉండటం.. ఊపిరి ఆడకుండా చనిపోయినట్లు నివేదిక రావడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో విస్తూపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రియుడి మోజులో పడి భార్య విజయలక్ష్మీ, సందీప్ తో కలిసి భర్తను చంపినట్లు తేలింది. దీంతో వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news