యూట్యూబ్, ఫేస్‌బుక్ నుంచి డబ్బు సంపాదించే వాళ్ళు ఈ విషయం తెలుసుకోవాల్సిందే…!

-

మీరు యూట్యూబ్ ఛానెల్ ని నడుపుతున్నారు…? లేదా ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా డబ్బులని సంపాదిస్తున్నారు…? అయితే ఇలా చేసే వాళ్ళు తప్పక ఈ విషయాన్ని తెలుసుకోవాలి. నేటి కలం లో చాల మంది సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్ళు తప్పక దీనిని తెలుసుకోవాలి. అసలు విషయానికి వస్తే… మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా సంపాదించే వారు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలుకు చివరి గడువు ముగిసింది. ఇప్పుడు మీరు ఐటీఆర్ దాఖలు చేయాలంటే భారీ జరిమానా చెల్లించుకోవాలి. యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సంపాదించే వారు ఐటీఆర్ దాఖలు చేయాలి. అయితే వార్షిక టర్నోవర్ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షలు కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళే దాఖలు చేయాలి.

యోగ టీచర్, స్పిర్చువల్ స్పీకర్లు, ప్రైవేట్ కోచింగ్ ఫ్యాకల్టీ వంటి వారు కూడా వారి ఆదాయం రూ.50 లక్షలు దాటితే వారు కూడా ఐటీఆర్‌ ఆడిట్ చేసుకోవాలి. టర్నోవర్ రూ.50 లక్షలు దాటితేనే వర్తిస్తుంది గుర్తుంచుకోండి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా అర్జించే రాబడి సర్వీస్ సెక్టార్ కిందకు వస్తుంది. అందువల్ల ఇన్‌కమ్ ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలి. అందు వల్ల ఈ విషయాన్ని తప్పక గుర్తు పెట్టుకోండి.

 

Read more RELATED
Recommended to you

Latest news