కోహ్లీ, ధోనీల కెప్టెన్సీ చూశారు..ఇక నా స్టైల్‌ చూపిస్తా : డూప్లెసిస్

-

ఐపీఎల్ 2022 మార్చి 26 వ తేదీన ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే… నిన్న తమ కొత్త కెప్టెన్ ను ప్రకటించింది బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ యాజమాన్యం. ఆర్సిబి కొత్త కెప్టెన్ గా దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ డుప్లెసిస్ ను ఎంపిక చేసింది RCB. ఈ మేరకు ఓ ఈ వీడియోను కూడా విడుదల చేసింది.

అయితే.. తనకు కెప్టెన్సీ ఇవ్వడంతో కొత్త కెప్టెన్‌ డుప్లెసిస్‌ స్పందించారు. “చెన్నై జట్టు లో చేరిన సమయంలో కెప్టెన్సీ అంటే నాకంటూ ఒక ఆలోచన ఉండేది. కానీ ధోని నా ఆలోచనలకు పూర్తిగా భిన్నంగా కనిపించాడు. నా సంస్కృతి దక్షిణాఫ్రికా. కొత్త వాతావరణానికి వచ్చాను. దాంతో ధోనీ నా ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా కనిపించాడు. ఎన్నో స్టైల్స్ ఉంటాయని అప్పుడే నేను అర్థం చేసుకున్నాను. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే… నీ కంటూ ప్రత్యేకమైన స్టైల్ ఉండాలి. ఇన్ని రోజులు విరాట్ కోహ్లీ, ధోనీలా కెప్టెన్సీ చూశారు. ఇకనుంచి నా స్టైల్ లో కెప్టెన్సీ చేస్తా. జట్టుకు విజయాన్ని అందిస్తా.. ” అంటూ డుప్లెసిస్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news