పెళ్ళింట విషాదం.. తల్లి, ఇద్దరు కూతుళ్ళు సూసైడ్

-

 ఖమ్మం గాంధీ చౌక్ ప్రాంతంలో  తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లీ ,ఇద్దరు కూతుర్లు సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఖమ్మం నగరంలోని రాఘవ థియేటర్ ప్రాంతంలో నివసించే కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కష్టపడి పని చేస్తే ఏ రోజుకు ఆ రోజు గడిచే కుటుంబంలో కుమార్తెకు వివాహం నిశ్చయం అయ్యింది. జనవరి 11 న వివాహం జరగాల్సి ఉంది. తండ్రి ప్రకాష్ బంగారు షాపులో పని చేస్తారు.

hanging-suicide
hanging-suicide

తల్లి కూతుళ్ళు ఇద్దరూ టైలారింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరిలో రాధిక వివాహం ఖరారు అయింది. కట్నం లేకుండా ఈమెను వివాహం చేసుకోవడానికి ఒక వ్యక్తి  సిద్ధం అయ్యారు. అయితే వివాహం దగ్గర పడటం ,డబ్బులు లేకపోవడంతో భాదతో  రాత్రి బంగారం మెరుగు పెట్టే రసాయనం తాగి తల్లి గోవిందమ్మ (49)రాధిక(29),రమ్య(28) ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి ప్రకాష్ ఇంటికి వచ్చే సరికి కుటుంభ సభ్యులు ముగ్గురూ ఆత్మహత్య చేసుకుని కనిపించరు. దీంతో ఆయన భోరు మన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతి చెందిన వారి బాడీలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీస్ లు  కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news