‘దేశముదురు’ మేనియా.. థియేటర్​లో టపాసులు కాల్చిన ఫ్యాన్స్.. అడ్డుకున్న పోలీసులు

-

ప్రస్తుతం టాలీవుడ్​లో రీ రిలీజ్​ల హవా నడుస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోల బ్లాక్​బస్టర్ సినిమాలు రి రిలీజ్ అయి.. కలెక్షన్లు కురిపించాయి. తాజాగా ఆ జాబితాలో ఐకాన్ స్టార్ మూవీ దేశముదురు చేసింది. ఈ సినిమాను గురువారం రోజున రీ రిలీజ్ చేశారు. మళ్లీ ఒకసారి బన్నీని మాస్ హీరోగా చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు.

అయితే హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్‌లో ‘దేశముదురు’ షో వేయగా… అభిమానులు అత్యుత్సాహం కనబరిచారు. సినిమా స్క్రీనింగ్‌ అవుతోన్న సమయంలో కొంతమంది థియేటర్‌లోనే టపాసులు కాల్చి రచ్చ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. షో నిలిపివేశారు. దీనికి సంబంధించిన విజువల్స్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడి.. థియేటర్‌కు నష్టం వచ్చేలా చేయవద్దని.. ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించవద్దని నెటిజన్లు కోరుతున్నారు. మరికొన్ని థియేటర్లలో అభిమానులు డ్యాన్స్‌లు చేస్తూ కనిపించారు.

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బన్నీకి జంటగా హన్సిక సందడి చేశారు. ౨౦౦౭లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news