కవిత భుజాన తుపాకీ పెట్టి.. కేజ్రీవాల్ ని కొట్టే కుట్ర జరుగుతుంది – మాజీ ఎంపీ పొన్నం

-

బిజెపి – బిఆర్ఎస్ పార్టీలపై కీలక ఆరోపణలు చేశారు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. బిఆర్ఎస్ కి సమస్య వచ్చినప్పుడు బిజెపి, బిజెపికి సమస్య వచ్చినప్పుడు బిఆర్ఎస్ ఆదుకుంటుందని ఆరోపించారు. ఎస్ఎస్సి పేపర్ లీక్ కాదు అని సిపి అంటున్నారని.. బిఆర్ఎస్ వాళ్లు మాత్రం పేపర్ లీక్ అంటారని దుయ్యబట్టారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసిన వాళ్లకి ఇప్పటివరకు బెయిల్ లభించలేదని.. కానీ ఎస్ఎస్సి పేపర్ లీక్ చేసిన బండి సంజయ్ కి వెంటనే బెయిల్ వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఇదేం డ్రామా జరుగుతుందని మండిపడ్డారు పొన్నం. బిజెపిని పెంచడానికి బిఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని.. అందులో బలికా బకరా బండి సంజయ్ అని ఎద్దేవా చేశారు.

ఇదంతా అమిత్ షా, కెసిఆర్ ఆడుతున్న డ్రామా అన్నారు పొన్నం. మద్యం కుంభకోణంలో కవిత అరెస్టు కాదని.. కవిత భుజాన తుపాకీ పెట్టి.. అరవింద్ కేజ్రీవాల్ ని కొట్టే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేస్తానంటే కేసీఆర్ ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశాన్ని దృష్టి మరల్చేందుకే ఎస్ఎస్సి పేపర్ లీక్ ని తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news