పవన్ సహాయకచర్యలకు ఎందుకు రాలేదో కళ్లకు కట్టినట్లు చూపించిన ఫ్యాన్స్..వైరల్!

-

ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ,గుంటూరులోని పలుగ్రామాలు నీట మునిగిన విషయం తెలిసిందే. ప్రకాశం బ్యారేజీకి వరద పొటెత్తడంతో పాటు బుడమేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడ పట్టణం మొత్తం జలమయం అయ్యింది.లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం అయ్యాయి. దీంతో బెజవాడ ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఈ ఘటన నుంచి ఇప్పటికీ వారు కోలుకోలేకపోతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో వస్తువులు మొత్తం తడిచిపోగా ప్రస్తుతం వాటిని ఆరబెట్టుకునే పనిలో బాధితులు నిమగ్నమయ్యారు.

ఇదిలాఉండగా, వరదల్లో ప్రజలు అల్లాడుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు పరామర్శకు రాలేదంటూ ప్రతిపక్ష వైసీసీ పార్టీ విమర్శించడంతో ఫ్యాన్స్ అందుకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సహాయక చర్యలకు ఇబ్బంది రాకూడదనే పవన్ రాలేదని సమాధానం ఇస్తున్నారు.కాగా, బుధవారం రాత్రి పవన్ కూడా స్పందిస్తూ.. తాను ఎందుకు రాలేదో.. వస్తే ఏం జరుగుతుందో చూపిస్తానంటూ ఆయన విలేకరులకు చెప్పి బయటకు రాగానే ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. ఇందుకే పవన్ రాలేదని.. ఒకవేళ వస్తే సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని జనసేన సైనికులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news