ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. టిక్రి, ఘాజీపూర్ బార్డర్లలో బారికేడ్లు తొలగిస్తున్న పోలీసులు

-

కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలకు నిరసనగా గత ఏడాది నవంబర్ 26 నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. హర్యానా- ఢిల్లీ మధ్యలో ఉన్న టిక్రి, యూపీ- ఢిల్లీ మధ్యలో ఉన్న ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతులు బారికేడ్లను అడ్డంగా పెట్టి నిరసన తెలుపుతున్నారు. అక్కడే శిబిరాలు ఏర్పాటు చేసుకుని నిరసన తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం వీటన్నింటిని తొలగించి రోడ్లను క్లియర్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. జేసీబీల సహాయంతో పెద్దపెద్ద కాంక్రీట్ బ్లాక్ లను, బారికేడ్లను తొలగిస్తున్నారు. సరిహద్దుల్లో రోడ్లపై రైతులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలతో స్థానికులకు ఇబ్బందులు ఏర్పడుతుండటంతో ఈఅంశం సుప్రీం కోర్ట్ కు చేరింది. అక్టోబర్ 21న సుప్రీం కోర్ట్ రోడ్లను అడ్డుకోవడంపై స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. రైతులకు నిరసన తెలిపే హక్కు ఉంటుంది..కానీ ఉద్దేశపూర్వకంగా రోడ్లను బ్లాక్ చేసే హక్కు లేదని తెలిపింది. తాము రోడ్లకు ఎలాంటి అడ్డంకులు ఏర్పాటు చేయలేదని..ఆ పనిచేసింది పోలీసులే అని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు నిన్న రైతు సంఘాల నాయకులు, అధికారులు బార్డర్లను పరిశీలించారు. గత అర్థరాత్రి నుంచి అధికారులు రోడ్లపై అవాంతరాలను తొలగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news