ఏపీలో మరో ఘటన.. బిడ్డ మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్ళిన తండ్రి..

-

ఏపీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. బిడ్డ మృతదేహాన్ని బైక్ పై ఓ తండ్రి తీసుకెళ్ళిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. దీనిపై లోకేష్ సీరియస్ అయ్యారు. మీపై కుళ్ళు, కుతంత్రాలతో దుష్ప్రచారం చేస్తున్నారని మీరు మాట్లాడడం వల్ల మీకు, మీ నాయకులకు ఆత్మసంతృప్తి కలగొచ్చు ఏమో కానీ ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు జగన్ రెడ్డి గారు అని మండిపడ్డారు.

మీరు మా పై అక్కసుతో మాట్లాడుతున్న సందర్భంలోనే అంబులెన్స్ మాఫియా ఆగడాలు తట్టుకోలేక.. తిరుపతి జిల్లా నాయుడుపేట లో రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని బైక్ పై సొంత ఊరికి తీసుకెళ్ళాడు ఓ తండ్రి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బంది సహకరించక, అంబులెన్స్ మాఫియా డిమాండ్ చేసిన డబ్బు లేక చిన్నారి అక్షయ మృతదేహాన్ని 18 కి.మీ బైక్ పై సొంత గ్రామం.. కొత్తపల్లి కి తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితిని కల్పించింది వైసిపి ప్రభుత్వమని పేర్కొన్నారు. ఫ్రస్ట్రేషన్ పక్కన పెట్టి పని పై దృష్టి పెట్టండి. కాస్తయినా పరిస్థితులు మెరుగుపడతాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news