“విరాట పర్వం” సినిమా నుండి బిగ్ అప్డేట్

-

కరోనా సమయంలో ఎన్ని సినిమాలు వాయిదా పడ్డాయో అన్ని సినిమాలు విడుదల అయి ప్రేక్షకుల ఆదరణ పొందాయి. కానీ ‘విరాట పర్వం’ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అప్పుడెప్పుడో ఒక రిలీజ్ డేట్ ని ప్రకటించారు. వెంటనే లాక్డౌన్ స్టార్ట్ అయింది. అయితే లాక్ డౌన్ తర్వాత మరో రిలీజ్ డేట్ ప్రకటించారు.కానీ మరోసారి లాక్ డౌన్. ఇక అప్పటినుంచి సినిమా గురించిన ఒక అప్డేట్ ను మేకర్స్ ఇవ్వలేదు. దీంతో పలువురు పలు రకాలుగా అనుకోవడం మొదలుపెట్టారు. కొంత మంది ఓటిటి లో వస్తుందని, కొంతమంది అసలు సినిమా రిలీజ్ కాదని కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

ఇక ఎట్టకేలకు ఈ పుకార్లకు చెక్ పెట్టేశారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ కి సంబంధించిన అప్డేట్ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు తెలపనున్నట్లు ప్రకటించారు. ఉత్తర తెలంగాణలో 1990 నేపథ్యంలో జరిగిన యదార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా.. నక్సలైట్ రవన్న గా కనిపించనుండగా.. భారతక్క గా ప్రియమణి, రవన్న రచనలకు ఫిదా అయ్యి అతడి కోసం అడవి కి వెళ్లి ఇబ్బందులు పడిన యువతిగా సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ అప్డేట్ విన్న రానా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news