కాంగ్రెస్‌లోకి మొదలైన చేరికలు

-

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం కావడంతో తెలంగాణ కాంగ్రెస్ లోకి చేరికలు మొదలయ్యాయి. టీఆర్ఎస్, బీజేపీ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ తనయుడు, బీజేపీ ఎంపీ అర్వింద్‌ సోదరుడు అయిన ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ తో భేటీ అయ్యారు. త్వరలోనే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ధర్మపురి సంజయ్ చెప్పారు. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగానని తన నాన్న కోసమే గతంలో టీఆర్ఎస్ లో చేరినట్లు వెల్లడించారు.. రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం కోసం తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తున్నానని … త్వరలో ఢిల్లీ వెళ్లి పెద్దల సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు సంజయ్ వివరించారు.

మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. బీజేపీకి రాజీనామా చేసినట్టుగా ఆయన ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్లు చెప్పారు. భూపాలపల్లి సీనియర్‌ నాయకుడు గండ్ర సత్యనారాయణ కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిపారు. రేవంత్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ బలోపేతం అవుతుందని గండ్ర సత్యానారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు

Read more RELATED
Recommended to you

Latest news