ప్రారంభం నాడే ఆదిపురుష్ సెట్ లో అగ్ని ప్రమాదం..

-

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ప్రారంభమైన కొద్ది సేపటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ముంబై స్టూడియో లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సినిమాకోసం వేసిన గ్రీన్ మ్యాట్స్ అన్నీ కాలిపోయాయి అని తెలుస్తోంది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని తెలుస్తోంది.

అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు ఇలా జరగడం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. తాజాగా ఈ అంశం మీద హీరో మంచు మనోజ్ స్పందించారు. మొదటి రోజు ఇలా జరగడం వల్ల దిష్టి పోతుందని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే అసలు అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news