పాఠశాలలో ఘోర అగ్నిప్రమాదం.. 18 మంది మృతి

-

చైనా లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదం లో సుమారు 18 మంది మృతి చెందగా మరో 16 మంది క్షతగాత్రులుగా మిగిలిపోయారు. సెంట్రల్ చైనా యునాన్ ప్రావిన్స్ లోని సాంగ్ జిత్ సింగ్ కౌంటీ స్థానిక మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలో శుక్రవారం తెల్లవారు జామున ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వేకువ జాము కావడంతో మంటలు పూర్తిగా వ్యాపించే వరకు ఎవరూ గుర్తించలేక పోయారు. దీంతో ఈ అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

ఇప్పటికే ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది  మృతి చెందగా… మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాదం తీవ్రస్థాయిలో ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు అధికారులు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియ రాలేదు. ప్రస్తుతం… అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news