BREAKING : ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజ..పాల్గొన్న తమిళిసై

-

హైదరాబాద్‌ లోని ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజ పూర్తి అయింది. కాసేపటి క్రితమే ఈ పూజ పూర్తి అయింది. ఇక ఈ తొలి పూజలో తెలంగాణ మంత్రి తలసాని, గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై.. తొలిపూజలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు గవర్నర్.

కరోనాతో రెండేళ్లుగా ప్రజలు ఇక్కడికి రాలేకపోయారు, ప్రజలు సంతోషంగా ఉండేలా విగ్నేశ్వరుడ్ని కోరుకున్నానని వెల్లడించారు తమిళి సై. ఖైరతాబాద్ గణేష ఏర్పాట్లు చాలా బాగున్నాయి… రెండేళ్లు కరోనా కారణంగా చాలా మందికి ఇక్కడికి రాలేకపోయారన్నారు. ఇప్పుడు అందరూ దర్శనం చేసుకునే అవకాశం ఉంది.. తెలంగాణ ప్రజలు సుఖ శాంతులతో ఉండేలా ఆ విగ్నేశ్వరుడు చూడాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు గవర్నర్ తమిళిసై.

Read more RELATED
Recommended to you

Latest news