తెలంగాణలో ఉంది ఫౌమ్‌హౌజ్ ప్రభుత్వం: కిషన్ రెడ్డి

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ విమర్శల దాడికి పాల్పడుతోంది. తెలంగాణలో ప్రస్తుతం నడుస్తోంది కేసీఆర్ ప్రభుత్వం కాదని, ఫామ్‌హౌస్ ప్రభుత్వమని, ఫ్యామిలీ ప్రభుత్వమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడంతో అప్పటి నుంచి ప్రధాని మోడీపై కేసీఆర్ విషం చిమ్ముతున్నారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు బీజేపీ ముచ్చెమటలు పట్టించిందన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను మూడు చెరువుల నీళ్లు తాగించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే టీఆర్ఎస్ భవిష్యత్ కన్నులకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు. మునుగోడులో ఓడిపోతామనే భయంతో ప్రధాని మోడీపై మళ్లీ విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news