కర్ణాటక హెల్త్ మినిస్టర్ కు కరోనా పాజిటివ్…!

-

కరోనా బారిన పడుతున్న నేతల సంఖ్య అధికమవుతోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు గత ఆదివారం కరోనా నిర్ధరణ అయిన సంగతి తెలిసిందే. ఆయన కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్​ ద్వారా3 వ తారీఖున తెలిపారు. అయితే ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని, వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని యడ్యూరప్ప వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా స్వీయ నిర్బంధం పాటించాలని ఆయన కోరారు.

minister sriramulu
minister sriramulu

ఫ్లూ కారణంగా కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ రాములు ఈరోజు కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమై శానిటేషన్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి తన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు శ్రీరాములు తెలిపారు. నాయకులు సైతం మహమ్మారి బారిన పడడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news