తక్కువ డబ్బులతోనే ఫారెన్ టూర్ వేయాలనుకుంటున్నారా..? అయితే ఈ ప్యాకేజీని చూడాల్సిందే..!

-

మీరు ఏదైనా ఫారెన్ టూర్ వేయాలనుకుంటున్నారా..? అది కూడా తక్కువ డబ్బుల్లోనే వెళ్లి వచ్చేయాలనుకుంటున్నారా..? అయితే మీరు కచ్చితంగా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)  అందించే ఈ టూర్ ని చూడాల్సిందే. మరి ఇక పూర్తి వివరాలని చూస్తే..

తక్కువ ధరలోనే విదేశీ టూర్ వెళ్లి రావచ్చు. ప్రస్తుతం థాయ్‌లాండ్ కోసం ఈ ఎయిర్ టూర్ ప్యాకేజీని తీసుకు వచ్చింది ఐఆర్‌సీటీసీ. థాయ్‌లాండ్ డిలైట్స్ ఎక్స్ గువాహటి పేరుతో దీన్ని తీసుకొచ్చారు. రూ.49,067కే థాయ్‌లాండ్ ని చూసి వచ్చేయచ్చు. పైగా ఇతర బెనిఫిట్స్ ని కూడా ఈ టూర్ లో భాగంగా మనం పొందొచ్చు.

ఇక ప్యాకేజీ చూస్తే.. ఇది మొత్తం ఆరు రోజులు, ఐదు రాత్రుల టూర్ ప్యాకేజీ. అక్టోబర్ 13, 2022 నుంచి అక్టోబర్ 18, 2022 వరకు ఉంటుంది. బ్యాంకాక్, పట్టాయ వంటి డెస్టినేషన్స్‌ ని కవర్ చేస్తుంది. 4 బ్రేక్‌ఫాస్టులు, 4 లంచ్‌లు, 4 డిన్నర్లు ఉంటాయి. అలానే థాయ్‌లాండ్‌కి వెళ్లడం, రావడం విమానంలోనే. హోటల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది.

పట్టాయలో కోరల్ ద్వీపను చూడచ్చు. అదే విధంగా మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా లభిస్తుంది .ఒకళ్లే కనుక ఈ ట్రిప్‌కి వెళ్తే రూ.56,753 అవుతుంది. అదే డబల్ ఆక్యుపెన్సీ అయితే రూ.49,067 అవుతుంది. పూర్తి వివరాలను మీరు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కి వెళ్లి చూడచ్చు. అక్కడే బుక్ చేసుకోవచ్చు కూడా.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news