కొత్త అవతారం ఎత్తిన మాజీమంత్రి కొడాలి నాని

-

ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి కొడాలి నాని అంటే తెలియని వారు ఉండరు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై తనదైన మాటల తూటాలు పేలుస్తుంటారు. ఎప్పుడూ గడ్డం, మీసం.. మెడలో రుద్రాక్ష మాలలు, చేతికి ఉంగరాలతో కనిపిస్తూ ఉండే కొడాలి నాని కొత్త అవతారం ఎత్తారు. ఏంటంటే.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఉదయం విఐపి విరామసమయంలో కొడాలి నాని స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యులు, తన నియోజకవర్గ ప్రజలు, సీఎం జగన్ కుటుంబ సభ్యులు, వైసీపీ ప్రభుత్వం బాగుండాలని శ్రీనివాసుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news