మంత్రి మల్లారెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

-

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డిపై వివాదస్పద వాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి. మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అని తనకు తానే ప్రకటించుకోవడం ఏంటని, అధిష్టానం ఏమైనా చెప్పిందా..? అని ప్రశ్నించారు సుధీర్ రెడ్డి.

బి.ఆర్.ఎస్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన తనను, తన కుమారుడైన జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది చంద్రారెడ్డిని కించపరిస్తున్నారని, పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలకు పిలవడం లేదని ఆరోపంచారు సుధీర్ రెడ్డి. మేడ్చెల్ నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలో కూడా జరిగిందని, దాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రస్తావించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బి.ఆర్.ఎస్ కార్యకర్తలందరిని పిలవలేదని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదన్నారు సుధీర్ రెడ్డి. ఇక సుధీర్ రెడ్డి మాట్లాడుతుందండగానే మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు మంత్రి మల్లారెడ్డి. దీంతో ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news