మంత్రి గంగుల కమలాకర్ కి తప్పిన పెను ప్రమాదం

-

బిఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా చర్లబూట్కూర్ లో ఆదివారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో సభా వేదికపై ఉన్న మంత్రి గంగుల, ఇతర నేతలు అంతా ఒక్కసారిగా కింద పడిపోయారు.

ఈ ప్రమాదంలో మంత్రికి ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కానీ ఓ జెడ్పిటిసి సభ్యుని కాలు విరగడంతో హుటాహుటిన ఆయనని ఆసుపత్రికి తరలించారు. వేదిక పైకి పరిమితికి మించి నాయకులు ఎక్కడంతోనే వేదిక కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంపై మంత్రి గంగుల స్పందించారు. తనకి చిన్న గాయమే తగిలిందని.. ప్రాథమిక చికిత్స కూడా చేసుకున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news