పాలేరులో పోటీకి సిద్ధమైన వైఎస్ షర్మిల..నేడు పార్టీ కార్యాలయం ప్రారంభం

-

తెలంగాణ వైసీపీ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల తెలంగాణలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే, పాలేరు నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు వైఎస్‌ షర్మిల. ఇందులో భాగంగానే.. ఇవాళ వైసీపీ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.

ఖమ్మం రూరల్‌ మండలం కరుణగిరి వద్ద వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు వైఎస్‌ షర్మిల. శంకుస్థాపన తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసి మాట్లాడిన తర్వాత మీడియాతో వైఎస్‌ షర్మిల మాట్లాడుతారు. పాలేరు నుంచి పోటీ చేస్తానని గతంలోనే ప్రకటించిన వైఎస్‌ షర్మిల.. ఇప్పుడు అదే నియోజక వర్గంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. దీంతో పాలేరు రాజకీయాలు వేడేక్కాయి.

Read more RELATED
Recommended to you

Latest news