తెలంగాణలో కలకలం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి..!

-

తెలంగాణలోని వనపర్తి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ మరణాలకు క్షుద్రపూజలే కారణమని అనుమానాలు తలెత్తడంతో స్థానికులు భయపడిపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రేవల్లి మండలం నాగపూర్‌ కి చెందిన ఒకే కుటుంబంలోని వ్యక్తులు అజీరాం బీ(63), ఆమె కూతురు ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా (10) మరణించారు. వీరి మృతదేహాలు ఇంట్లో వేరువేరు చోట్ల పడివుండటం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కి పంపించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంట్లో నిమ్మకాయలు, పసుపు కుంకుమ, అగర బత్తీలు ఉండటంతో పాటు ఇంటి ఆవరణలో పలుచోట్ల గుంతలు తవ్వి ఉండడంతో క్షుద్రపూజలు జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. కానీ, ఈ మరణాలకు అసలు కారణం ఏంటన్నది మాత్రం అంతు చిక్కడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news