పెనమలూరు ఒంటరి మహిళపై దాడి కేసులో నలుగురికి జీవిత ఖైదు

-

విజయవాడ : పెనమలూరు ఒంటరి మహిళలపై దాడి చేసి దోపిడీ చేసిన కేసులో నలుగురికి జీవిత ఖైదు విధించింది విజయవాడ కోర్టు. గత రెండు సంవత్సరాల క్రితం ఒంటరిగా ఉన్న మహిళలని టార్గెట్ గా చేసుకుని దోపిడీలకు పాల్పడింది ఈ గ్యాంగ్. పెనమలూరు, పటమట పోలీస్ స్టేషన్ ల పరిధిలో దోపిడీలకు పాల్పడింది ఈ ముఠా. ఇంటిలో నిద్రిస్తున్న వారిపై దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది ఈ ముఠా.

అప్పటి పోలీస్ కమిషనర్ బత్తుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేశారు. సీసీఫుటేజ్ అధారంగా నలుగురిని గుర్తించారు పోలీసులు. తనదైన శైలిలో విచారించగా తమే హత్య చేస్తున్నట్లు ఒప్పుకున్నారు నలుగురు నిందితులు. ఎట్టకేలకు నిందితులకు శిక్షపడటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు బాదిత కుటుంబ సభ్యులు.

Read more RELATED
Recommended to you

Latest news