‘ఆన్​లైన్​ గేమ్​లో రూ.11కోట్ల జాక్​పాట్’.. వాటా కోసం కిడ్నాప్ చేసిన ఫ్రెండ్స్

-

ఇంజినీరింగ్ విద్యార్థి కిడ్నాప్ కేసును ఛేదించారు కర్ణాటక హుబ్లీ ధార్వాడ్ పోలీసులు. ఏడుగురిని అరెస్టు చేశారు. నిందితులంతా.. కిడ్నాపునకు గురైన యువకుడి స్నేహితులేనని నిర్ధరించారు.

పోలీసుల కథనం ప్రకారం.. కిడ్నాపునకు గురైన వ్యక్తి పేరు గరీబ్ నవాజ్ ముల్లా. హుబ్బళ్లి నివాసి. నగరంలోని ఓ ఇంజినీరింగ్​ కాలేజీలో చదువుతున్నాడు. దిల్వర్​ అనే స్నేహితుడితో కలిసి ఆన్​లైన్​ కసీనో గేమ్​ ఆడేవాడు. ఇద్దరికీ బాగా డబ్బులు వచ్చాయి. కొందరు స్నేహితులతో కలిసి ఆ సొమ్ము ఖర్చు చేసేవాడు గరీబ్ నవాజ్. ఫలితంగా.. ఆన్​లైమ్​ బెట్టింగ్ గేమ్​లో అతడికి ఏకంగా రూ.11 కోట్లు వచ్చాయని ప్రచారం జరిగింది.

నవాజ్ స్నేహితులైన నిందితులు.. అతడి కదలికలపై నిఘా పెట్టారు. ఈనెల 6న కిడ్నాప్ చేశారు. నవాజ్ తండ్రికి ఫోన్​ చేసి.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు ఆయన నిరాకరించగా.. కనీసం రూ.15లక్షలైనా ఇవ్వాలని, లేదంటే నవాజ్​ను చంపేస్తామని బెదిరించారు.

హుబ్బళ్లిలోని బెండిగెరి పోలీస్​ స్టేషన్​లో అదే రోజున ఫిర్యాదు చేశారు నవాజ్ తండ్రి. కేసును సీరియస్​గా తీసుకున్న హుబ్లీ ధార్వాడ్ కమిషనర్ లాబూరామ్.. నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సెల్​ఫోన్​ నెట్​వర్క్ ద్వారా నిందితుల్ని ట్రాక్ చేసి మంగళవారం రాత్రి ఏడుగుర్ని అరెస్టు చేశారు. వారిని మహ్మద్ ఆరిఫ్, అబ్దుల్ కరీమ్, హుసేన్ సాబ్, ఇమ్రాన్ మదరాలీ, తౌసిఫ్​, మహ్మద్ రజాక్​గా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news