తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

-

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. ఏప్రిల్ 25 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ఉండనున్నాయి. సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలు, వేసవి సెలవులపై విద్యాశాఖ కీలక సమాచారం వెల్లడించింది. ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి.


మార్చి రెండోవారం అంటే 15 వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయాల్లో ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే విద్యా సంస్థలు నడపాలని పేర్కొంది విద్యాశాఖ.

ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 17 వరకు, 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 20 వరకు పరీక్షల నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 21 ఫలితాలు వెల్లడి, ఏప్రిల్ 24న అన్ని స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news