వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖే రాజధాని : మంత్రి అమర్నాథ్‌

-

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్దిరోజుల్లో విశాఖ వచ్చి.. ఇక్కడే తన పరిపాలన చేస్తారని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాజధాని కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు మంత్రి అమర్నాథ్. అందరూ అనుకున్న సమయానికంటే ముందే ముఖ్యమంత్రి విశాఖకు వస్తారని పేర్కొన్నారు.విశాఖ కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్​లో మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. జీఐఎస్ సదస్సు 2023 విజయవంతమైందని.. రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మీడియాకు తెలిపారు. 376 ఎంవోయూలు జరిగాయని దాదాపు 6 లక్షల ఉద్యోగాలు రావడం ఖాయం అన్నారు.

ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో… ఎంవోయూల మీద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీ పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు. ఇప్పటికే ఎన్నో పరిశ్రమలకు సంబధించి 96 అనుమతులు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నామని వ్యక్తపరిచారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో మొదటి స్థానంలో తామే ఉన్నామని, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. పారిశ్రామిక వేత్తలు కోరుతున్నట్లుగా.. వారికి కావలసిన మానవ వనరులు పుష్కలంగా తమ రాష్ట్రంలో ఉన్నాయని.. రొయ్యలు, కోకో, మ్యాంగో పల్ప్ ఏపీ నుంచి ఎగుమతి అవుతున్నాయని అన్నారు అమర్నాథ్. విశాఖ తిరుపతి శ్రీ సిటీ కోపర్తిలో ఐటీ అభివృద్ధి చేపడుతున్నామన్నారు. ఆరు నెలల్లో ఏయే కంపెనీలు గ్రౌండ్ రియాలిటీ చేస్తారో వారికి ప్రభుత్వం తరఫున మంచి సహకారం లభిస్తుందని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news