గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు యువకులు మృతి

-

హైదరాబాద్ రోడ్లు రక్తమోడుతున్నాయి. రోజు ఏదో ఒక చోట ఒక యాక్సిడెంట్ అయినా నమోదు అవుతూ వస్తోంది. తాజాగా గచ్చిబౌలి లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్ ను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు తీవ్రగాయాలతో ఉన్న యువకుడిని దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్చారు.

Accident
Accident

ఈ ఘటన ఈ ఉదయం మూడు గంటల సమయంలో జరిగినట్లు చెబుతున్నారు. అతివేగం నిద్రపోతే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది యువకులు ఎవరు ఏమిటి అనే వివరాలు కూడా ఏమీ తెలియలేదు. వీకెండ్ కావడంతో మద్యం మత్తులో ఏమైనా వీరు కారు నడిపి ప్రమాదానికి గురయ్యారు అనేది కూడా తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. 

Read more RELATED
Recommended to you

Latest news